ఆదిపురుష్‌ ను లైట్ తీసుకుంటున్న ఫ్యాన్స్

ప్రభాస్ ఆదిపురుష్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. మూడు రోజుల్లోనే 340 కోట్ల గ్రాస్ వసూలు చేసి సత్తా చాటుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీతో ప్రభాస్ వరుసగా మొదటి రోజే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక హీరోగా అవతరించాడు. కలెక్షన్స్ పరంగా ఆదిపురుష్ అదరగొడుతున్నా.. విమర్శల పరంగా మాత్రం బదులు లేని విధంగా ఎదుర్కొంటోంది. రామాయణ గాథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్ తెరకెక్కించాడు. బట్ అతని డైరెక్షన్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఇక గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుటే అంత మంచిది అన్నట్టుగా తయారయింది. ముఖ్యంగా ప్రభాస్ రాముడుగా అస్సలు నప్పలేదు అని ఒక వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఎలా చూసినా ఇది అభాసుపాలైన చిత్రంగానే చెబుతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ ట్రోల్స్ పై పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అందుకు కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్లే వాళ్లు ఆదిపురుష్ ను లైట్ తీసుకుంటున్నారు.


నిజానికి ఆదిపురుష్ రిజల్ట్ ఎక్స్ పెక్ట్ చేసిందే. కలెక్షన్స్ వచ్చినంత మాత్రాన ఇదం కళాఖండం కాదు. ఇంకా చెబిత ఇప్పటి వరకూ వచ్చిన చెత్త రామాయణ కథ ఇదే అంటే అతిశయోక్తీ లేదు. భక్తి భావం ఉన్నవాళ్లు కూడా ఏదో మూల ఇబ్బంది పడేలా తీశాడు ఓమ్ రౌత్. ఈ విషయంలో ఫ్యాన్స్ ప్రిపేర్డ్ గా ఉన్నారనేది నిజం. అందుకే విమర్శలను, ట్రోల్స్ ను లైట్‌ తీసుకుటున్నారు. అందుకు కారణం తర్వాత వచ్చే ప్రభాస్ సినిమాలే.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ నటించిన సినిమా సలార్ ఈ యేడాది సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందనేది వారి ఫీలింగ్. దీంతో పాటు ప్రాజెక్ట్ కే కూడా ఉంది. ఈ రెండు సినిమాలు ప్రభాస్ ను గ్లోబల్ రేంజ్ లో తిరుగులేని స్టార్ గా నిలుపుతాయని ట్రేడ్ కూడా అంచనా వేస్తోంది. అలాగే రాజాడీలక్స్ కూడా కంటె