డబ్బింగ్ షురూ చేసిన భోళా

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్. ఆగస్ట్ 11న విడుదల కాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. రీసెంట్ గానే భోళా శంకర్ కు గుమ్మడికాయ కొట్టేశారు. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎప్పుడో స్టార్ట్ అయింది కాబట్టి.. ఇక రిలీజ్ డేట్ వైపు శరవేగంగా పరుగులు పెడుతున్నాడు భోళా శంకర్.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా తను డబ్బింగ్ చెబుతున్న ఫోటోస్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.


“డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఒక్కో సన్నివేశం ఎంత గొప్పగా వచ్చిందో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఓ చాలా పెద్ద ఫైర్ మాస్ ఎంటర్టైనర్ అవుతుందని గ్యారెంటీ ఇస్తున్నాను. ప్రేక్షకులూ .. మీ క్యాలెండర్ లో మార్క్ చేసుకోండి. థియేటర్స్ లో కలుద్దాం .. ” అనే క్యాప్షన్ జోడించాడు మెగాస్టార్.


ఇక మెహర్ రమేష్‌ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ ఆయనకు చెల్లి పాత్రలో కనిపించబోతోంది. ఆల్రెడీ తమిళ్ లో వచ్చిన వేదాళం చిత్రానికి ఇది రీమేక్. అయితే తెలుగు వెర్షన్ కు తగ్గట్టుగా అనేక మార్పులు చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో కనిపించే బ్యాక్ గ్రౌండ్ తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ హైలెట్ అవుతుందంటున్నారు. వీటికి తోడు మెగాస్టార్ గ్రేస్ అండ్ టైమింగ్ ఎలాగూ ఎసెట్ గానే ఉంటాయి. మొత్తంగా చాలా యేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన దర్శకుడు మెహర్ రమేష్ ఫ్యూచర్ అంతా ఈ చిత్రంపైనే ఆధారపడి ఉందని చెప్పాలి.