విజయ్ సినిమాపై దిల్ రాజు డామినేషన్

ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అంటారు. బట్ సినిమా పరిశ్రమలో అప్పుడప్పుడూ ఫస్ట్ ఈజ్ లాస్ట్ అవుతుంది. సింపుల్ గా పవన్ కళ్యాణ్ సినిమాల లైనప్ అనౌన్స్ మెంట్స్ చూస్తే అర్థం అవుతుంది. ముందు ఒప్పుకున్న సినిమాలు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. కానీ ఈ మధ్యే ఒప్పుకున్నవి ఆల్రెడీ విడుదలైపోయాయి కూడా. అలా ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా ముందు కమిట్ అయిన ప్రాజెక్ట్ వెనక్కి వెళుతోంది.

అందుకు కారణం దిల్ రాజు సినిమా. యస్.. విజయ్ దేవరకొండ కొన్ని రోజుల క్రితం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కు కమిట్ అయ్యాడు. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లిన తర్వాతే పరశురామ్ డైరెక్షన్ లో దిల్ రాజు బ్యానర్ లో సినిమా అనౌన్స్ అయింది. అయితే ఈ రెండు సినిమాల షూటింగ్స్ లోనూ ఒకేసారి పార్టిసిపేట్ చేస్తాడు అనుకున్నారు. బట్ దిల్ రాజు సినిమాతో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాడు. సంక్రాంతి బరిలో తన సినిమాను నిలిపాడు. సంక్రాంతి అంటే తక్కువ టైమ్ ఉంది. అందుకే గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ ఆపేశారు.


ఖుషీ విడుదల తర్వాత నుంచి పూర్తిగా దిల్ రాజు సినిమాకే డేట్స్ ఇచ్చాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే మళ్లీ గౌతమ్ ప్రాజెక్ట్ లో అడుగుపెడతాడట. ఇది కాస్త అన్యాయంగా అనిపిస్తుంది కానీ.. ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ గానే జరుగుతుంటాయి. అన్నీటికీ ఓ అండర్ స్టాండింగ్ ఉంటుంది.


ఇక విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలుంటాయి. మొదట ఈ చిత్రంలోనూ రష్మిక మందన్నాను హీరోయిన్ గా తీసుకుంటారు అనుకున్నారు. బట్ లేటెస్ట్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేసుకున్నారు. ఈ చిత్రానికి ఫ్యామిలీ మేన్ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారట.

మరి ఈ టైటిల్ చూస్తే సంక్రాంతి విడుదలకు సరిగ్గా ఉంటుంది అనిపిస్తుంది కదా.. అందుకే దిల్ రాజు సంక్రాంతిని ఫిక్స్ చేసుకున్నాడు. పైగా ఆయనకు సంక్రాంతి సినిమాలు మంచి విజయాలతో పాటుఅవార్డులు కూడా ఇచ్చాయి. అందుకే �