పూరీ జగన్నాథ్ – రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ ఫస్ట్ టైమ్ కాస్త డీ గ్లామర్ తో నటించాడు. అలాగే మొదటిసారిగా తెలంగాణ స్లాంగ్ లో చెప్పిన డైలాగ్స్ మొదటి పదినిమిషాలు ఇబ్బంది పెట్టినా తర్వాత కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్.
బలమైన కథ కాకపోయినా.. చాలా రోజుల తర్వాత పూరీ నుంచి వచ్చిన మాస్ ఎంటర్టైనర్ కావడం.. కాంబినేషన్ క్రేజ్ కు తోడు.. నభా నటేష్, నిధి అగర్వాల్ అందాలు, మణిశర్మ మ్యూజిక్, రామ్ డ్యాన్సులు అన్నీ కలిపి ఈ చిత్రాన్ని బిగ్ హిట్ నిలిపాయి.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే చెప్పారు. ఆ సీక్వెల్ కు టైమ్ వచ్చింది. ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించి 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతున్నారు.
అయితే లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కూడా నటించబోతోందట.
కాజల్ ఇంతకు ముందు పూరీ జగన్నాథ్ తో బిజినెస్ మేన్ సినిమాలో నటించింది. రామ్ తో గణేష్ అనే సినిమాలో నటించింది. ఈ రెండూ పోయినా.. కాజల్ కు మంచి పేరే వచ్చింది. అయితే ఇస్మార్ట్ శంకర్ లో నభా నటేష్ పాత్ర చనిపోతుంది.
తన ప్లేస్ లో అని చెప్పలేం కానీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి కాజల్ కూడా ఎంటర్ అవుతుందని సమాచారం. త్వరలోనే తన ఎంట్రీ గురించిన అ