భోళా శంకర్ మేమే చేశామా అనే డౌట్ వచ్చింది – రామ్ లక్ష్మణ్

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రంగరంగ వైభవంగా జరుగుతోంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కాబోతోంది. కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లి పాత్రలో తమన్నా చిరంజీవికి జోడీగా నటించిన సినిమా ఇది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ లు చెప్పిన మాటలు ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చాయి.


” ఈ ఫంక్షన్ కోసం మెగాస్టార్ అభిమానులందరూ నాలుగు గంటల నుంచే వెయిట్ చేస్తున్నారు. మీ ఎనర్జీయే సినిమా పరిశ్రను ఎక్కడికో తీసుకువెళుతున్నాయి. అందుకు మీ అందరికీ నమస్కారం. అన్ని పరిశ్రమలు తెలుగు పరిశ్రమపై కన్నేశాయంటే కారణం దర్శకులు. భోళా శంకర్ టీజర్ చూశాం. ఇది మేమే చేశామా అనే డౌట్ మాకే వచ్చింది. కొత్త స్టైల్లో అన్నయ్య ఎనర్జీని ప్రెజెంట్ చేశాం.

టీజర్ లో రోప్ షాట్స్ చూసి ఉంటారు. కానీ ఈ ఏజ్ లో కూడా అన్నయ్య అన్నీ ఒరిజినల్ గా చేశారు. ఎంత రిస్క్ అయినా చేస్తా అని చెప్పి యాక్షన్ ఎపిసోడ్స్ లో ఎన్నో రిస్క్ లు చేశారు. అన్నయ్యను పాతికేళ్లు వెనక్కి తీసుకువెళ్లి చూపించిన డడ్లీగారికీ, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, మణిశర్మ గారి అబ్బాయి మహతి స్వరసాగర్ గారికి థ్యాంక్యూ.

మెహర్ రమేష్ గారితో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో మా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. అందరినీ ప్రేమతో పలకరించే దర్శకుడు భోళా శంకర్. ఈ సినిమాలో అన్నయ్యను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. చిరంజీవి గారిని ఒకసారి అడిగాను.. ఇంత ఎనర్జీ ఏంటన్నయ్యా.. 8గంటలకు రమ్మన్నా 7గంటలకే ఎలా వస్తున్నారు అని అడిగితే.. నాకు సినిమానే అంతా.. షూటింగ్ లేకపోతే నాకు ఏం తోచదు అని మెగాస్టార్ గారు చెప్పారు. అదీ ఆయనకు సినిమాపై ఉన్న ప్రేమ. మీరు కూడా మీ జీవితాలను ప్రేమించండి. మీరు కోరుకున్నది జరుగుతుందీ అన్నారు.