షాహిద్‌ హై యాక్షన్ ప్యాక్డ్ సీన్లతో ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’

ఊహకు, వాస్తవాలకు మధ్య ఉండే అద్భుతమైన కథను, గాధను ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ చూపించబోతోన్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా.. ఈ మాగ్నమ్ ఓపస్‌ను సచిన్ రవి తెరకెక్కిస్తున్నారు. ‘అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్’ అనే ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ ఇలా ఐదు భాషల్లో రానుంది.


మహాభారత గాధలో చిరంజీవిగా పేరొందిన పాత్ర అశ్వత్ధామ. అంటే ఆ యోధుడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని నమ్మేవారున్నారు. ఆ అశ్వత్థామ నేటి డిజిటల్ యుగంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనేది ఈ చిత్ర కథాంశం. హై యాక్షన్ ప్యాక్డ్ సీన్లతో సినిమాను అద్భుతంగా తీర్చి దిద్దబోతోన్నారు. అమర జీవిగా ఇన్ని వేల సంవత్సరాలు ఎలా బతికి ఉన్నాడు అనే పాయింట్‌ను కూడా చూపించబోతోన్నారు.
మా సంస్థ నుంచి రాబోయే సినిమాలు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా ప్రేక్షకులకు గొప్ప అనుభూతినివ్వాలని కోరుకుంటామన్నారు నిర్మాత జాకీ భగ్నాని. బడే మియా చోటే మియా తర్వాత, నేను ఊహించని సినిమా చేయాలనుకున్నాను. ఇది మనందరికీ తెలిసిన కథ. ఈ కథపై ప్రస్తుత ఆధునిక కాల పరిస్థితులు, వాటి వల్ల ఆ లెజెండ్ చేయాల్సి వచ్చిన యుద్దం ఏంటన్నది ప్రేక్షకులు మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది’ అని అన్నారు.


మహాభారతంలోని అశ్వత్థామ ఈనాటికీ జీవిస్తున్నాడని నమ్ముతుంటారు. అతను అమరజీవి అని భావిస్తుంటాం. అతని కథనాన్ని లోతుగా పరిశోధించాలనే నా కోరికకు ఆజ్యం పోసింది. నా లక్ష్యం ఈ కథకు ప్రాణం పోసి, ప్రస్తుత కాలక్రమంలో అతనిని ఉంచడం.. అమర జీవి యొక్క సంక్లిష్టమైన మనస్తత్వం ఎలా ప్రభావితం అవుతుంది.. అతను వేల సంవత్సరాలుగా చూసిన ప్రపంచాన్ని అతను ఎలా గ్రహించాడో అన్వేషించడం అనే పాయింట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. నేను అతని కథను భారీ ఎత్తున, మునుపెన్నడూ చూడని యాక్షన్ చిత్రంగా మ