నటుడిగా మారిన జాతిరత్నం

తెరవెనుక డైరెక్టర్ కుర్చీలో కూర్చునేవారు అప్పుడప్పుడూ తెరముందు కూడా సందడి చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొంతమంది డైరెక్టర్స్ అయితే రెగ్యులర్ యాక్టర్స్ లా బిజీ అయిన వారూ ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ తొలి తరంలో ఎల్వీ ప్రసాద్, కె.ఎస్.ప్రకాశరావు, వై.వి.రావు వంటి వారు దర్శకులుగానూ నటులుగానూ రాణించారు. ఇక ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన రికార్డు దర్శకరత్న దాసరి నారాయణరావు సొంతం. నాటక రంగం నుంచి సినిమా రంగానికి వచ్చిన దాసరి వెండితెరపై నటుడుగానూ సత్తా చాటారు.

గురువు దాసరి నారాయణరావు బాటలోనే శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా గుర్తింపు పొందారు కోడి రామకృష్ణ. దర్శకత్వంతో పాటు.. కొన్ని సినిమాలలో నటుడిగానూ తనదైన ప్రత్యేకతను చాటారు కోడి. ‘మూడిళ్ల ముచ్చట, ఇంటి దొంగ, అత్తగారూ స్వాగతం, ఆస్తి మూరెడు ఆశ బారెడు, దొంగాట’ వంటి చిత్రాలలో అతిథి పాత్రలలో అలరించారు కోడి రామకృష్ణ.

తెలుగు చిత్ర సీమకు పలు కళాత్మక సినిమాలు అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ కూడా నటుడిగా వెండితెరపై తనదైన ముద్ర వేశారు. కమల్ హాసన్ హీరోగా తానే దర్శకత్వం వహించిన ‘శుభసంకల్పం’ సినిమాతో నటుడిగా మారారు విశ్వనాథ్. ఆ తర్వాత ‘వజ్రం, కలిసుందాం రా, నువ్వు లేక నేను లేను, సంతోషం, ఠాగూర్, స్వరాభిషేకం, మిస్టర్ పర్ ఫెక్ట్, ఉత్తమ విలన్’ వంటి చిత్రాలలో సహాయ నటుడిగా మెప్పించారు.

అసలు హీరో అవుదామని చిత్ర పరిశ్రమకు వచ్చి దర్శకుడిగా సత్తా చాటారు ఎస్వీ కృష్ణారెడ్డి. దర్శకుడిగా వరుస విజయాలందుకుంటున్న సమయంలో నటుడిగా మారి తన ఆన్ స్క్రీన్ కలను సాకారం చేసుకున్నారు. ‘అభిషేకం, ఉగాది’ సినిమాలలో కథ�