గోదావరి కుర్రాళ్ల గొడవ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా..?

తెలుగు సినిమా పరిశ్రమలో వైవిధ్యమైన కథలకు ఓటు వేసే హీరోల్లో శ్రీవిష్ణు ముందు వరుసలో ఉంటాడు. హిట్టూ ఫ్లాపులతో పనిలేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళుతున్న శ్రీ విష్ణు ఖాతాలో సక్సెస్ లు కూడా ఎక్కువే ఉన్నాయి. రీసెంట్ గానే రాజరాజ చోర సినిమాతో ఆకట్టుకున్న విష్ణు ఇప్పుడు అర్జున ఫల్గుణ అనే సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రానిన్ని తేజ మార్ని అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్, టీజర్స్, పాటలతో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.
శ్రీ విష్ణు నుంచి ఊహించినట్టుగానే మరో వైవిధ్యమైన సినిమా వస్తుందన్న విషయం ట్రైలర్ చూడగానే అర్థమవుతుంది. గోదావరి జిల్లాల్లోని ఓ చిన్న గ్రామానికి చెందిన కుర్రాళ్లు అనుకోకుండా ఓ కేస్ లో చిక్కుకుంటారు. అది కూడా వైజాగ్ ప్రాంతం నుంచి స్మగుల్ అవుతోన్న గంజాయి రవాణా విషయంలో. అసలే ఆ విషయంలో చాలా సీరియస్ గా ఉండే పోలీస్ లు వీరిని వెంటాడుతుంటే.. ఒక వైపు తప్పించుకునే ప్రయత్నం.. మరోవైపు తమను పట్టించిన వారిని పట్టుకునే ప్రయత్నంలో సాలిడ్ స్టోరీ ప్యాక్ లానే కనిపిస్తోందీ చిత్రం.
ఇప్పటి వరకూ శ్రీ విష్ణు చేసిన చిత్రాల్లో యాక్షన్ పరంగా ఎక్కువగా ఆకట్టుకుంది అప్పట్లో ఒకడుండేవాడు అనే చిత్రం. కానీ ఈ సారి అంతకు మించిన యాక్షన్ పార్ట్స్ ఈ �