ధనుష్ మూవీలో పవర్ హౌస్

మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెర్సటైల్ స్టార్ ధనుష్‌ తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ములతో సినిమా కమిట్ అయి ఉన్నాడు. ఈ మూవీలో ఓ పవర్ హౌస్ లాంటి పాత్ర కావాలట. ఆ పవర్ నాగార్జునలో తప్ప ఇంకెవరిలో ఉంటుంది అంటూ నాగార్జున .. తమ సినిమాలో నటిస్తున్న విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు నిర్మాతలు సునిల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్.

నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో నాగ్ నటిస్తాడని గతంలోనూ వార్తలు వచ్చాయి. సినిమా అనౌన్స్ అయినప్పుడే ఈ విషయం చెబుతారు అనుకున్నారు. అప్పుడు చెప్పకపోవడంతో నాగ్ కాకుండా ఇంకేదైనా ఆల్టర్ నేట్ చూసుకుంటున్నారా లేక నాగార్జున చేయను అన్నాడా అనే డౌట్స్ వ్యక్తం చేశారు.

కాకపోతే నాగార్జున గురించి అనౌన్స్ చేయాలంటే ఓ మంచి సందర్భం కూడా కావాలనుకున్నారేమో.. అందుకే ఈ బర్త్ డే ను సెలెక్ట్ చేసుకున్నారు. నిజానికి ఆ అనౌన్స్ మెంట్ కు నాగ్ బర్త్ డేకు మధ్య గ్యాప్ కూడా పెద్దది కాదు. అందుకే ఆగి ఉంటారు అనుకోవచ్చు.


ఇక ప్యాన్ ఇండియన్ సినిమాగా రూపొందబోతోన్న ఈ చిత్రలో ధనుష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా ఫైనల్ అయింది. ఇప్పటి వరకూ శేఖర్ కమ్ముల తీసిన సినిమాలన్నీ లోకల్ నేటివిటీతో ఉన్న కథలే. ఫస్ట్ టైమ్ ప్యాన్ ఇండియన్ మూవీ చేస్తున్నాడు.

అది కూడా ధనుష్ లాంటి పెద్ద స్టార్ తో. ఓ స్టార్ తో వర్క్ చేయడం కూడా శేఖర్ కు ఇదే ఫస్ట్ టైమ్. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో కానీ నాగార్జున ఎంట్రీతో మరింత వెయిట్ వస్తుందని చెప్పొచ్చు. ఇక ఇలాంటి గెస్ట్ రోల్స్, ముఖ్యమైన పాత్రలు చేయడం నాగ్ కు కొత్తేం కాదు. గతంలో చాలా సినిమాల్లో ఇలా నటించాడు.