ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో.. ది బెస్ట్ క్రియేషన్, సెవెన్హిల్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ వంటి సినిమాతో అభిరుచి గల నిర్మాతగా పేరొందిన సెవెన్హిల్స్ సతీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిత్ర ట్రైలర్ను ఆవిష్కరించి.. చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా ప్యాండమిక్ తరువాత రీ రిలీజులు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్లో కనపడుతోంది. నిజమే ఒక కాఫీ షాప్లో ఇన్ని జరుగుతూ ఉంటాయి కాబోలు అని అర్థమైంది. చాలా ఎంటర్టైనింగ్గా ట్రైలర్ కనిపిస్తోంది. నేను చాలా ఎంజాయ్ చేశాను.
ఈ ట్రైలర్ చూశాక నాకు ఆర్.పి గారే హీరో అనిపించింది. ఎందుకంటే.. కథే హీరో కనుక ఆ కథను మలిచింది ఆయనే కనుక. ఆర్.పి గారు ఏ క్రాఫ్ట్కు వెళ్ళినా సక్సెస్ ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.. ఎందుకంటే మేము టీనేజ్లో ఉన్నప్పుడు ఆయన కంపోజ్ చేసిన పాటలే ఎక్కువగా వినే వాళ్ళం. ఆ పాటలే లేకుంటే మా టీనేజ్ అంతా ఏమైపోయేదో.. మమ్మల్ని అంత ఇంప్రెస్ చేశాయి. ఇక ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరితో నా కెరీర్ మొదటి నుంచి కలిసి ట్రావెల్ చేశాను. ఫ్రెండ్స్ మధ్య ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ.. టీమ్కి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను..’’ అన్నారు.అతిథిగా హాజరైన నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. మొదట ఈ టైటిల్ చెప్పగానే ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ఏ