సాయి పల్లవి ఓవర్ యాక్షన్ చేస్తోందా..?

సాయి పల్లవి.. తెలుగులో న్యూ సెన్సేషన్. ఫిదాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ తమిళ సోయగం.. చాలా త్వరగానే మన ఆడియన్స్ కు మోస్ట్ఫేవరెట్ అయిపోయింది. ముఖ్యంగా యూత్, విమెన్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. సహజంగా డ్యాన్సర్ కావడంతో ఆమె డ్యాన్స్ కు కూడా సెపరేట్ ఫ్యాన్బేస్ ఉంది. మరోవైపు కథాబలం ఉన్న చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటూ గ్లామర్ కు దూరంగా విజయాలకు దగ్గరగా జర్నీ చేస్తోన్న సాయి పల్లవి.. తెలుగులో ఈ నెల17న విరాటపర్వం సినిమాతో రాబోతోంది. మరోవైపు తమిళ్ లో గార్గి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో పాటు శివకార్తికేయన్ సరసన ఓ సినిమా చేస్తోంది.ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ చెబుతోన్న కొన్ని మాటలు వింటుంటే ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి.

కొన్నాళ్లక్రితం మదనపల్లిలో జరిగిన ఓ సంఘటన గుర్తుకు రావడం ఖాయం.మామూలుగా చాలామంది దేవుళ్లను నమ్ముతారు. తమ కష్టాలు చెప్పుకుంటారు. కోర్కెలు తీర్చమని వేడుకుంటారు. ఇంత వరకూ అది భక్తి అనిపించుకుంటుంది. కానీ సాయి పల్లవి కాస్త డిఫరెంట్. ఏకంగా తను దేవుడితో మాట్లాడతాను అని చెబుతోంది. ఇది టూ మచ్ అనిపిస్తోంది కదూ. పైగా ఇలాంటి వాటినే తీవ్ర వాదాలు అని చెబుతుంటాం. నిజమే.. ఇలాగ భావించే అప్పుడు మదనపల్లిలో ఓ తల్లి ఇద్దరు కూతుళ్లను చంపి తనూ చనిపోయింది. భక్తి ముదిరితే పిచ్చి అవుతుంది. ఆ పిచ్చిలో ఎవరేం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు సాయి పల్లవి కూడా చేస్తోంది అదే. అంటే మరీ తను చనిపోతుంది అని చెప్పలేం కానీ.. భక్తి తీవ్రత ముదిరింది.
మరోవైపు అమ్మడు ప్రమోషన్స్ లోనూ, ఇంటర్వ్యూస్ లోనూ సహజంగా కంటే కాస్త ఓవర్ యాక్షన్ చేస్తోంది అనే మాటలూ వినిపిస్తున్నాయి. కొన్ని మాటలు కావాలనే చెబుతుంది అంటున్నారు. అంటే మాడెస్టీగా బిహేవ్ చేస్తుంది అనేది స్ఫష్టంగానే తెలిసిపోతుంది. ఇలాంటి ఓవర్ యాక్షన్స్ మాత్రం ఎక్కువ కాలం నిలవవు. సహజంగా ఉంటే ఓకే కానీ తను మరీ ఆర్టిఫిషియల్ గా ప్రవర్తిస్తోంది అనేది చాలామంది చెబుతోన్న మాట.ఇక భక్తి విషయానికి వస్తే తను పుట్టపర్తిలో చదువుకుంది. అందుకే భక్తి సహజమే కానీ.. ఇలా అతిగా ఉంటే మాత్రం కృత్రిమంగా ఉంటుంది.