ఘోస్ట్ కు దారి ఇచ్చిన గాడ్ ఫాదర్..

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు బాక్సాఫీస్ వార్ కు దిగితే డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అవుతారు. ఆడియన్స్ కు కిక్ ఉన్నా.. నిర్మాతకు కునుకు పట్టదు. అలాంటి సమస్యలేం రాకుండా మన నిన్నటి తరం స్టార్స్ అందర్లానే వెనకా ముందూ ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ స్టార్స్ .. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున. ఈ ఇద్దరూ దసరా బరిలోనే నిలిచారు. అయితే ఒకే రోజు వస్తే సమస్య అవుతుంది కాబట్టి.. ఓ కొత్త డెసిషన్ తీసుకుని రిలీజ్ ల్లో మార్పులు చేసుకున్నారు. మరి ఎవరు ఏ డేట్ లో వస్తున్నారో చూద్దాం.
మళయాల బ్లాక్ బస్టర్ లూసీఫర్ ను రీమేక్ చేస్తూ మెగాస్టార్ గాడ్ ఫాదర్ లా వస్తున్నాడు.

పరిమితమైన పాత్రలున్నా.. బలమైన కంటెంట్ ఉన్న సినిమా ఇది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ అనొచ్చు. నయనతార కీలక పాత్రలో నటించగా.. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశాడు. ఇతర పాత్రల్లో సత్యదేవ్, సునిల్, మురళీశర్మ వంటి వారు నటించారు. మోహన్ రాజా డైరక్ట్ చేసి ఈ చిత్రాన్ని దసరా బరిలో విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అదే టైమ్ కు అక్టోబర్ 5న వస్తున్నట్టు గాడ్ ఫాదర్ కంటే ముందే అక్కినేని నాగార్జున ఘోస్ట్ అనౌన్స్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య ఇబ్బంది ఎందుకని మెగాస్టార్ తన సినిమాను అక్టోబర్ 4నే విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నాడని టాక్. ముందే చెప్పనట్టుగా నాగార్జున ఘోస్ట్ అక్టోబర్ 5నే వస్తుంది.

ప్రవీణ్‌ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీపై మంచి హోప్స్ ఉన్నాయి నాగార్జునకు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే మ్యాగ్జిమం గ్యారెంటీ అనిపిస్తోంది. సోనాల్ చౌహాన్ ఫీమేల్ లీడ్ చేసింది. అవుట్ అండ్ అవుట్ స్టైలిష్‌ యాక్షన్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోందీ ఘోస్ట్. టైటిల్ జస్టిఫికేషన్ ట్రైలర్ కే తెలిసిపోయింది. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూస్తోన్న నాగ్ ఈ ఘోస్ట్ తో బౌన్స్ బ్యాక్ అవుతాడు అనిపిస్తోంది. సో.. ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ ఫైట్ ను అడ్జెస్ట్ చేసుకుని ఒక రోజు తేడాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలూ దసరా పండగ సంబరాన్ని రెట్టింపు చేసే విజయం సాధించాలని కోరుకుందాం.