రాధా మమతా ప్రెజెంట్స్, ఎస్.కె. ఆర్ట్స్ బ్యానర్స్ పై దుర్మార్గుడు
ఫేమ్ విజయ్ కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం గణా
. సుకన్య, తేజు హీరోయిన్స్ గా నటించారు. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ డైరెక్టర్ శ్రీ ఎస్వీ క్రిష్ణారెడ్డి ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు.ఈ సందర్భంగా ఎస్వీ క్రిష్ణా రెడ్డి మాట్లాడుతూ..’నేను పుట్టింది తూర్పుగోదావరి జిల్లా..ఇప్పుడు అక్కడి నుంచే మరో వ్యక్తి అతను పేరు కూడా క్రిష్ణారెడ్డే..కాకపోతే విజయ్ క్రిష్ణా రెడ్డి. విజయ క్రిష్ణా రెడ్డి అనే ఒక వ్యక్తి కృషి తో, పట్టుదలతో, దీక్షతో గణా చిత్రాన్ని రూపొందించారు. విజయ్ క్రిష్ణ హీరోగా నటిస్తూ కథ, స్క్రీన్ ప్లే, ప్లస్ డైరెక్షన్ కూడా చేశారు. ఆయనే ప్రొడ్యూసర్ గా కూడా ఈ సినిమాని తీశారు. అన్నీ ఆయనే చేస్తూ సినిమా తీయడమంటూ మామూలు విషయం కాదు. దీనికి ఎంతో సహకారం ఉండాలి..ఎంతో మంది వ్యక్తులు ఇతనికి సహకరించడం వలన సాధ్యపడుతుంది. సినిమా అంటే మాటలు కాదు కదా..కాబట్టి అందరి సహకారంతో ఇతను ఈ సినిమాని నిర్మించగలిగారు. అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఆదిత్యాశేషారెడ్డిగారు, ఫారిన్ నుండి ఎమ్.యు.ఎస్ రెడ్డిగారు, కాకినాడ కార్పొరేటర్ బాల ప్రసాద్ గారు, కర్రి బుచ్చిరెడ్డిగారు ఇలా అందరూ కలిసి ఒక మంచి సినిమా తియ్యాలనే తపనతో మన ముందుకొచ్చారు.
నా చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా“ అన్నారు.హీరో విజయ్ క్రిష్ణ మాట్లాడుతూ..’ దుర్మార్గుడు మూవీతో నన్నుహీరోగా వంశీగారు పరిచయం చేశారు.ప్రతీ వ్యక్తికీ ఒక ఆదర్శం ఉంటుంది. మాకు అన్నగారు ఎస్వీ క్రిష్ణారెడ్డిగారు ఆదర్శం. ‘గణా’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినందుకు సార్ కి నేనెప్పుడూ రుణపడి ఉంటాను..నా ధన్యవాదాలుతెలుపుకుంటున్నాను..నేను ఇది వరకు దుర్మార్గుడు, గోవిందా భజ గోవింద సినమాల్లో ప్రధాన పాత్రలో చేశాను. పాగల్ వంటి పలు చిత్రాల్లో విలన్ గా కూడా చేశాను. హీరోగా మూడో సినిమా గణా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేను తొలిసారిగా ఈ గణా చిత్రానికి డైరెక్టర్ �