చివరి దశకు చేరుకున్న ‘గేమ్ ఛేంజర్‘

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‘ కోసం మెగా ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్‘తో పాటే మొదలైన ‘గేమ్ ఛేంజర్‘ ఇంకా చిత్రీకరణ దశలో ఉండడం.. ఒకింతి అభిమానులను టెన్షన్ పెడుతూనే ఉంది. అయితే.. లేటెస్ట్ గా ‘గేమ్ ఛేంజర్‘ గురించి ఓ క్రేజీ అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంది. అదే.. ఈ సినిమా చివరిదశకు చేరుకుందనే విషయం. ‘గేమ్ ఛేంజర్‘ మొత్తం షూటింగ్ ఇంకా 30 రోజులు మాత్రమే ఉందట. అందులో చరణ్ పాల్గొనాల్సింది కేవలం 10 రోజులు మాత్రమేనట.

లేటెస్ట్ గా ఈ మూవీ షూటింగ్ రాజమండ్రిలో మొదలైనట్టు తెలుస్తోంది. ఒక వారం రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో ఒక పాటను కూడా చిత్రీకరిస్తారట. జూలై చివర లేదా సెప్టెంబర్ మొదటి వారం వరకూ షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేసి.. అక్టోబర్ లో ‘గేమ్ ఛేంజర్‘ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశాడట డైరెక్టర్ శంకర్. దిల్ రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘గేమ్ ఛేంజర్‘ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయంతో కనువిందు చేయబోతుండగా.. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు.

Related Posts