రీసెంట్గా రిలీజ్ అయిన గాడ్ఫాదర్లో నయన్ లుక్స్ కి జస్ట్ ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. మలయాళంలో మంజువారియర్కన్నా ఇక్కడ నయనతార మరింత గ్రేస్ఫుల్గా కనిపిస్తుందంటూ పొగిడేస్తున్నారు జనాలు. ఈ దసరాకు తెలుగు, హిందీ ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది లేడీ సూపర్స్టార్ నయనతార.
ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమాతోనే నార్త్ జనాలకు పరిచయమయింది నయనతార. ఇప్పుడు మళ్లీ చిరంజీవి చెల్లెలిగా బాలీవుడ్కి అడుగుపెడుతోంది. త్వరలో జవాన్ సినిమాతో జబర్దస్త్ గా డైరక్ట్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది.
రీసెంట్గా జరిగిన నయనతార పెళ్లికి కూడా బాలీవుడ్ బాద్షా షారుఖ్ అటెండ్ అయ్యాడు. ఆ పెళ్లి తర్వాత వరుసగా ప్రాజెక్టులతో బిజీ అయిన నయతార – విఘ్నేష్ ఇప్పుడు సెకండ్ హనీమూన్ ట్రిప్పులో ఉన్నారు. ఆ మధ్య థాయ్ల్యాండ్ వీధుల్లో కనిపించిన ఈ జంట, రీసెంట్గా స్పెయిన్కి చెక్కేసింది. బార్సిలోనా ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మేడ్రిడ్లో వాలిపోయింది.
అక్కడి వీధుల్లో తిరుగుతూ, బీచ్ల్లో రిలాక్స్ అవుతున్నారు. అక్కడ నయన్ విఘ్నేష్ తీసుకున్న ఫొటోలు నెట్టింట్లో ఇన్స్టంట్గా వైరల్ అవుతున్నాయి.
ఫొటోలతో పాటు తమిళంలో మంచి కవితలు కూడా రాసి యాడ్ చేస్తున్నాడు విఘ్నేష్. ఎప్పుడూ సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండే నయనతార ఇప్పుడు విఘ్నేష్ వల్ల రెగ్యులర్గా ఫ్యాన్స్తో టచ్లో ఉంటోంది.మలయాళంలో పృథ్విరాజ్తో నటించిన గోల్డ్ నయన్కి ఇమీడియేట్గా రిలీజ్ అవుతోంది.