సూపర్ స్టార్ మహేష్ బాబు, గీత గోవిందం ఫేమ్ పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం సర్కారు వారి పాట. ఇందులో మహేష్ సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ మూవీ పోస్టర్ అండ్ టీజర్ కు అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో సర్కారు వారి పాట పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. ఆర్ఆర్ఆర్ సినిమా వస్తుండడంతో రాజమౌళి కోరిక మేరకు సర్కారు వారి పాట విడుదల వాయిదా వేశారు.
ఈ మూవీ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే.. ఇటీవల మహేష్ బాబు మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. దీంతో ప్రస్తుతం మహేష్ రెస్ట్ తీసుకుంటుండడంతో సర్కారు వారి షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇంకా షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది ఆసక్తిగా మారింది. తాజా వార్త ఏంటంటే.. ఈ సినిమాకి ఇంకా చాలా రోజులే షూటింగ్ బ్యాలన్స్ ఉందట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ చిత్రానికి ఇంకా నెల రోజులకి పైగా షూట్ చెయ్యాల్సి ఉందట.
అందుకనే ఫిబ్రవరి నెల నుంచి ఈ షూటింగ్ ని స్టార్ట్ చెయ్యాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అప్పటికి మహేష్ రెడీ అవుతారు. ఏప్రిల్ 1 న సర్కారు వారి పాట రిలీజ్ అని ప్రకటించడం జరిగింది. ఈ డేట్ మారితే మరో మంచి డేట్ సెట్ కాదు. అందుచేత సాధ్యమైనంత ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేయాలి అనేది ప్లాన్. ఈ భారీ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధించిన మహేష్ సర్కారు వారి పాటతో కూడా బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి.