సినిమాలో నటించే హీరోయిన్స్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ వుంటుందో అందరికి తెలుసు. అలాంటిది ఓ అభిమాని తను అభిమానించే హీరోయిన్ని కలవాలనుకుంటాడు.అనుకోకుండా హీరోయిన్ కలిస్తే ఆ రాత్రి ఏం జరిగిందనేది ఈ చిత్ర ముఖ్య కథాంశం. శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రియాంక శర్మ, శివ ఆలపాటి షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ నటీనటులుగా అభిరామ్ M దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “డై హార్డ్ ఫ్యాన్”. ఈ చిత్రంలో హీరోయిన్ కి డైహర్ట్ ఫ్యాన్ గా శివ ఆలపాటి నటిస్తున్నాడు. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు. తాజాగా ఇందులో పరుగే పరుగు పాటను స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేశారు. ఈ పాటచాలా అద్బుతంగా ఉందని ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్ 2న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా దర్శకులు సుకుమార్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. అభిరామ్ M దర్శకత్వంలో చంద్రప్రియ సుబుధి నిర్మించిన సస్పెన్స్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ బాగుంది. ఈ సినిమాకు నా ఫ్రెండ్ మధు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి కొన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా టీం అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు అభిరామ్ మాట్లాడుతూ.. చాలా మంది ఈ టైటిల్ క్రెజీగా ఉందని పెట్టారా అని అడుగుతున్నారు. అయితే టైటిల్ తగ్గట్టే సినిమా ఉంటుంది. హీరోయిన్ కి , అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో అన్ని పాత్రలు హీరోయిన్ పాత్ర చుట్టూ తిరుగుతూ వుంటాయి.మధు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.బేబమ్మ పాత్రలో షకలక శంకర్ పాత్ర ఆద్యంతం నవ్విస్తుంది.కృష్ణ కాంత్ గా రాజీవ్ కనకాల ,మరియు నోయల్, హీరో, హీరోయిన్ లు చాలా సపోర్ట్ చేశారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిచారు.ఈ సినిమా కథ లో మలుపులు ప్రేక్షకుడ్ని థ్రిల్ చేస్తాయి. సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు
చిత్ర నిర్మాత చంద్రప్రియ సుబుధి మాట్లాడుతూ..మా చిత్ర ట్రైలర్ ను విడుదల చేసిన సుకుమార్ కి ధన్యవాదాలు. ఈ కథకు హీరో, హీరోయిన్స్ అంటూ ఉండరు. కథే హీరో. కంటెంట్ ఉంటేనే ఏ చిత్రాన్ని అయినా ప్రేక్షకులు అదరిస్తారని నమ్ముతాను. అందుకే నే�