బాలకృష్ణ, విజయ్ దేవరకొండ అసలేం జరుగుతోంది

ఏ హీరోతో ఏ దర్శకుడు ఎప్పుడు సినిమా చేయాలి అనే మేటర్స్ మాగ్జిమం ముందే ఫిక్స్ అయిపోయి ఉంటయి. అనుకోని కారణాలు తగిలితే తప్ప ఇలా ఫిక్స్ అయిపోయిన ప్రాజెక్ట్ లు అటూ ఇటైన సందర్భాలు తక్కువే ఉంటాయి. కాకపోతే ఒక్కోసారి “పెద్దోళ్లు”ఎంటర్ అయితే మారక తప్పని పరిస్థితి ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్ లోనే గతంలో నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉన్న పరశురామ్ సడెన్ గా మహేష్‌ బాబుతో సర్కారు వారి పాట చేయాల్సి వచ్చింది. చాలా ఎక్స్ పెక్ట్ చేసినా ఈ సర్కారువారి పాట అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. ఇక పరశురామ్ మళ్లీ నాగ చైతన్యతో 14రీల్స్ లో సినిమా చేస్తాడు అనుకున్నారు. చూస్తోంటే ఈ ప్రాజెక్ట్ ఈ సారి కూడా మిస్ అయ్యేలా కనిపిస్తోందంటున్నారు.పరశురామ్ అనే డైరెక్టర్ ను పెద్ద హీరోలు, నిర్మాతలు గుర్తించిన సినిమా గీత గోవిందం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ మూవీ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఏకంగా 100 కోట్లు కొల్లగొట్టింది. కలెక్షన్స్ కాదు కానీ.. పరశురామ్ సెన్సిబుల్ డైరెక్షన్ కు ఎక్కువ మార్కులు పడ్డాయి.