యూ ట్యూబ్ ను షేక్ చేస్తోన్న సర్కారు వారి పాట

సర్కారు వారి పాట హంగామా మరో వారం రోజుల్లో స్టార్ట్ అవుతోంది. మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో హైప్ ఓ రేంజ్ లో ఉంది. రీసెంట్ గా వచ్చిన ధియేట్రికల్ ట్రైలర్ ఆ హైప్ ని టెన్ టైమ్స్ పెంచేసింది. పరశురామ్ డైరెక్షన్లో యూనిక్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన సర్కారు వారి పాట ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు మోస్ట్ అవెయిటెడ్ మూవీ సర్కారు వారి పాట. మైత్రీ మూవీస్, 14 రీల్స్ సంస్థల్లో ఈ చిత్రం తెరకెక్కింది. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించింది. మహేష్, పరుశురామ్, కీర్తి కాంబోలో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. దీంతో ఈ కాంబినేషన్ పై ఆడియన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడింది. సర్కారు వారి పాట మూవీ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. మహేష్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్సే సినిమాకి మేజర్ హైలైట్. కీర్తు సురేష్ గత చిత్రాలకంటే అందంగా కనిపిస్తోంది. ఇక తమన్ ఎప్పట్లానే మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు సూపర్ హిట్ అయ్యాయి. పరశురామ్ ఇప్పటి వరకూ తీసిన సినిమాల్లో క్లాస్ సినిమాలే ఎక్కువ. కానీ సర్కారు వారి పాటలో తనలోని మాస్ యాంగిల్ ని కూడా చూపించబోతున్నాడని చెప్పొచ్చు.


సర్కారు వారి పాట ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. రెండు రోజుల ముందే ధియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 24 గంటల్లోనే ఆ ట్రైలర్ కి 27 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇది రికార్డ్ అని చెబుతున్నారు. బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకుని, తిరిగి చెల్లించని వ్యక్తుల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే అయితే కనుక అందరికీ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అవుతుంది. మొత్తంగా భారీ అంచనాలున్న సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సంలచనం సృష్టిస్తుందో చూడాలి.

Related Posts