దసరా ముగిసింది.. దివాళి మొదలైంది

బాక్సాఫీస్ వద్ద దసరా సందడి దాదాపు ముగిసినట్టే. ఇప్పుడు దివాళి సందడి మొదలవ్వబోతుంది. దివాళి కానుకగా నవంబర్ రెండో వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఛతుర్ముఖ పోరు జరగబోతుంది. అయితే.. వీటిలో తెలుగు నుంచి ఒకే సినిమా ఉండగా.. తమిళం నుంచి రెండు, హిందీ నుంచి ఒక సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరుకు సిద్ధమవుతున్నాయి.

దీపావళి కానుకగా నవంబర్ 10న రాబోతుంది వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ‘. ఇప్పటివరకూ ప్రేమకథా చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వైష్ణవ్ ఈ సినిమాలో ఊర మాస్ లుక్ తో అలరించబోతున్నాడు. వైష్ణవ్ కి జోడీగా శ్రీలీల నటించింది. మలయాళం హీరో జోజు జార్జ్ ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు. ఇక.. ఈమధ్య వరుస హిట్స్ తో మంచి జోరుమీదున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నుంచి ‘ఆదికేశవ‘ సినిమా వస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్.రెడ్డి దర్శకత్వం వహించాడు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ‘ఆదికేశవ‘ నుంచి రిలీజైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

పేరుకు తమిళ వాడే అయినా.. సొంతంగా తెలుగులో డబ్బింగ