పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో రాధేశ్యామ్ కూడా వాయిదా పడనుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను రాధేశ్యామ్ మేకర్స్ ఖండించారు. సంక్రాంతికి రావడం పక్కా అన్నట్టుగా ప్రకటించారు.
అయితే.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడం వలన రాధేశ్యామ్ వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ ఈరోజు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. గత కొన్ని రోజులు నుంచి జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ చేయాలని ప్రయత్నించాం కానీ.. మారుతున్న పరిస్థితులు కారణంగా వాయిదా వేయక తప్పడం లేదు అని ప్రకటించారు. ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ వల్ల అమెరికా వంటి దేశాలలో రోజుకు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మన భారత దేశంలోనూ ఇదే క్రమంలో వ్యాపిస్తోంది. దాంతో టాలీవుడ్ చిత్రాల రిలీజ్ను పోస్ట్పోన్ చేస్తున్నారు.
భారీ చిత్రాలు అన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయి. మార్చి నుంచి భారీ చిత్రాలు మళ్లీ థియేటర్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే.. న్యూ రిలీజ్ డేట్స్ పై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.