వెంకటేష్-అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీ ప్రారంభం

ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉండే వెంకటేష్.. ఈసారి మాత్రం కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ‘సైంధవ్‘ తర్వాత కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకున్న వెంకీ.. తాజాగా కొత్త సినిమాని ప్రారంభించాడు. అనిల్ రావిపూడి కలయికలో ‘ఎఫ్ 2, ఎఫ్ 3‘ తర్వాత వెంకటేష్ నటించబోతున్న మూడో చిత్రమిది. వీరి కలయికలో గత రెండు చిత్రాలను నిర్మించిన దిల్ రాజు నిర్మాణంలోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 58వ సినిమాగా రూపొందుతోన్న ఈ మూవీలో వెంకీకి జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.

ఈ సినిమా ముహూర్తానికి అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు లతో పాటు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి అతిథులుగా హాజరయ్యారు. హీరోహీరోయిన్లు వెంకటేష్, మీనాక్షి చౌదరిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు.

Related Posts