మరోసారి ‘ఫిదా‘ చేస్తామంటోన్న వరుణ్ – శేఖర్ కమ్ముల

వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ ‘ఫిదా‘. వరుణ్ తేజ్ తొలి చిత్రం ‘ముకుంద‘లో అతిథిగా మెరిసిన శేఖర్ కమ్ముల.. ఆ తర్వాత దర్శకుడిగా వరుణ్ తో ‘ఫిదా‘ తెరకెక్కించాడు. కంప్లీట్ శేఖర్ కమ్ముల స్టైల్ లో సాగే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాతోనే హీరోయిన్ గా సాయిపల్లవి తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

‘ఫిదా‘ తర్వాత మరోసారి వరుణ్ తేజ్ తో పనిచేయడానికి సిద్ధమవుతున్నాడట శేఖర్ కమ్ముల. ఇప్పటికే వరుణ్ తేజ్ కోసం ఓ కథ సిద్ధం చేయడం.. దాన్ని మెగా ప్రిన్స్ కు వినిపించడం జరిగిందట. ప్రస్తుతం ‘కుబేర‘ సినిమాతో బిజీగా ఉన్న శేఖర్.. అది పూర్తైన వెంటనే వరుణ్ మూవీకి సంబంధించి కథా విస్తరణ చేస్తాడట. మరోవైపు.. వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న వరుణ్ తేజ్ ప్రస్తుతం కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కా‘ సినిమా చేస్తున్నాడు.

Related Posts