షూటింగ్ పూర్తిచేసుకున్న ‘డబుల్ ఇస్మార్ట్’

ఎనర్జటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఫక్తు మాస్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న సినిమా ఇది. ‘ఇస్మార్ట్ శంకర్’కి సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీలో డబుల్ డోస్ ఫన్, రొమాన్స్, యాక్షన్ ఉంటాయని ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో హింట్ ఇచ్చింది టీమ్. మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా రిలీజైన ‘స్టెప్పామార్’ సాంగ్ ఓ రేంజులో ట్రెండ్ అవుతోంది.

తాజాగా.. ‘డబుల్ ఇస్మార్ట్’ షూటింగ్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో రామ్ కి జోడీగా కావ్య థాపర్ నటిస్తే.. ఇతర కీలక పాత్రలో సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. ఆగస్టు 15న ‘డబుల్ ఇస్మార్ట్’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts