‘భారతీయుడు 2‘ నుంచి రెండో పాట వచ్చింది

దక్షిణ భారతదేశంలోనే కాదు.. యావత్ దేశంలోనే వెండితెరపై పాటలను తెరకెక్కించడంలో డైరెక్టర్ శంకర్ ది ప్రత్యేక శైలి. ముఫ్ఫై ఏళ్ల క్రితం పెద్దగా టెక్నాలజీ లేని సమయంలోనే సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాలు చేశాడు శంకర్. ప్రస్తుతం శంకర్ నుంచి రాబోతున్న సినిమాల్లో ‘భారతీయుడు 2‘ ఒకటి. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘శౌరా‘ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘చెంగలువ‘ విడుదలైంది.

ఈ పాటను సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ పై చిత్రీకరించాడు శంకర్. అనిరుధ్ స్వరకల్పనలో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని అబ్బీ.వి, శ్రుతిక సముద్రాల ఆలపించారు. శంకర్ తనదైన శైలిలో భారతనంతో రొమాంటిక్ గా చిత్రీకరించిన ఈ పాట లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటుంది. జూన్ 1న ‘భారతీయుడు 2‘ ఆడియో ని గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు. జూలై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Related Posts