‘ఓజీ’ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన సుజీత్

ప్రస్తుతం సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ ట్రెండింగ్ లోకి దూసుకొచ్చింది. ఎలాంటి సందర్భం లేకున్నా ‘ఓజీ’ ట్రెండింగ్ లోకి రావడం వెనుక ప్రత్యేక కారణం ఈ సినిమా గురించి డైరెక్టర్ సుజీత్ చెప్పిన విషయాలే. ‘సాహో’ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుజీత్ వద్దకు.. ముందుగా మెగాస్టార్ చిరంజీవితో ‘లూసిఫర్’ రీమేక్ చేసే ఛాన్స్ వచ్చిందట. రీమేక్స్ ను చేయకూడదని మైండ్ లో ఫిక్స్ అయిన సుజీత్ ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట.

ఇక.. పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు రాగానే అక్కడ కూడా ఓ రీమేక్ చేయాల్సిందిగా ప్రపోజల్ పెట్టారట. అది తిరస్కరించాడట. అదే సందర్భంలో పవన్ ఏమైనా స్టోరీలు ఉన్నాయా? అని సుజీత్ ని అడగగా ‘ఓజీ’ స్టోరీ చెప్పడం.. అది వెంటనే పట్టాలెక్కడం జరిగిపోయాయట.

జూన్ నుంచి మళ్లీ ‘ఓజీ’ని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేశాడట సుజీత్. ఇప్పటికే ‘ఓజీ’ మూవీ ట్రైలర్ కట్ కూడా రెడీగా ఉందట. సెప్టెంబర్ 27న ‘ఓజీ’ చిత్రాన్ని విడుదలకు తాను రెడీగా ఉన్నట్టు లేటెస్ట్ ఇంటర్యూలో తెలిపాడు సుజీత్.

Related Posts