పాన్ ఇండియా లెవెల్ లో సుధీర్ బాబు కొత్త చిత్రం

తెలుగు కథానాయకుల్లో అసలు సిసలు యాక్షన్ హీరో అనిపించుకునే క్వాలిటీస్ సుధీర్ బాబు కి పుష్కలంగా ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం.. ఆయనొక అథ్లెట్ కావడం. అలాగే.. మార్షల్ ఆర్ట్స్ లో మంచి పట్టుండడం. అయితే.. ఇప్పటివరకూ సుధీర్ కి యాక్షన్ స్టార్ అనే ఇమేజ్ తీసుకొచ్చే క్యారెక్టర్ పడలేదు. సరైన స్క్రిప్ట్ పడాలే కానీ.. పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటగల క్వాలిటీస్ పుష్కలంగా హీరో సుధీర్ బాబు. ఇప్పటికే బాలీవుడ్ లో ‘భాఘీ 2‘ వంటి సినిమాతో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు సుధీర్.

లేటెస్ట్ గా పాన్ ఇండియాని టార్గెట్ చేస్తూ సుధీర్ బాబు ఒక సినిమా చేయబోతున్నాడు. బాలీవుడ్ లో ‘రుస్తోమ్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్‘ వంటి సినిమాలను నిర్మించిన నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టుకోనుందట. త్వరలోనే.. ఈ సినిమాలో నటించే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియనున్నాయి.

Related Posts