జూన్ 7న వస్తోన్న శర్వానంద్ ‘మనమే’

శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మనమే’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీలో శర్వాకి జోడీగా కృతి శెట్టి నటించింది. పూర్తిగా వ్యతిరేక స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఓ బాబు కోసం కలిసి జీవించాల్సి వస్తే.. ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది.

ఎక్కువగా యూరప్ బ్యాక్‌డ్రాప్ లో ఈ సినిమాని తీర్చిదిద్దారు మేకర్స్. శర్వానంద్ 35వ చిత్రంగా రూపొందిన ‘మనమే’ మూవీకి హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం మరో ప్లస్ పాయింట్ అని భావిస్తోంది టీమ్. ఇప్పటికే టీజర్ తో అలరిస్తోన్న ‘మనమే’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. జూన్ 7న వరల్డ్ వైడ్ గా ‘మనమే’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts