సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా ప్రకటన

మెగా ఫ్యామిలీలో స్టెడీ హిట్స్ తో దూసుకెళ్తున్న హీరో సాయిధరమ్ తేజ్. గతేడాది ‘విరూపాక్ష, బ్రో’ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు సాయి. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయిధరమ్ కి దక్కిన విజయాలివి. ఆ తర్వాత సితార ఎంటర్ టైన్‌మెంట్స్ లో సంపత్ నంది దర్శకుడిగా ‘గాంజా శంకర్’ను అనౌన్స్ చేశాడు. ఈ సినిమా నుంచి క్యారెక్టర్ గ్లింప్స్ కూడా రిలీజయ్యింది. అయితే.. కొన్నాళ్లుగా ఈ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ‘గాంజా శంకర్’ సాయిధరమ్ నటించే 17వ సినిమా.

ఇక.. లేటెస్ట్ గా తన 18వ సినిమాని అనౌన్స్ చేశాడు సాయి. ‘హనుమాన్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీతో రోహిత్ కె.పి. దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘ఎస్.డి.టి-18’ మూవీని అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ సినిమాకోసం ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించేలా ఈ పోస్టర్ ఉంది. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యింది.

Related Posts