పవన్ కళ్యాణ్ ని కలవడానికి స్పెషల్ ఫ్లైట్ లో నిర్మాతలు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ కి స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరిన ప్రముఖ నిర్మాతలు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో జరిగే బేటీ కోసం విజయవాడకు బయలుదేరిన నిర్మాతలు. ఈ భేటీలో పాల్గొనడానికి అగ్ర నిర్మాతలు చలసాని అశ్వినీ దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ, ఉండి ఎంఎల్ఏ కనుమూరి రఘురామకృష్ణంరాజు స్పెషల్ ఫ్లైట్ లో బయలుదేరారు.

ఇంకా.. పవన్ కళ్యాణ్ తో భేటీ అవ్వనున్న మరికొంత నిర్మాతలు రోడ్డు మార్గం ద్వారా విజయవాడ కి ప్రయాణమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నారు టాలీవుడ్ నిర్మాతలు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొనే అవకాశం ఉంది.

Related Posts