కొన్ని రోజుల క్రితం మాస్ మహారాజ రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో నాల్గవ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించాల్సి ఉంది. అయితే.. అనివార్య కారణాల వలన రవితేజ-గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ స్థానంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనే బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సన్నీ డియోల్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్.
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/06/WhatsApp-Image-2024-06-20-at-13.01.54.jpeg.webp)
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/06/WhatsApp-Image-2024-06-20-at-13.06.18.jpeg.webp)
‘ఎస్.డి.జి.ఎమ్‘ వర్కింగ్ టైటిల్ గా ఉన్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం మరో అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా ముందుకొచ్చింది. మైత్రీ-పీపుల్ మీడియా కాంబోలో ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందనుందట.
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/06/WhatsApp-Image-2024-06-20-at-13.06.03.jpeg.webp)
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/06/WhatsApp-Image-2024-06-20-at-13.05.46.jpeg.webp)
సన్నీ డియోల్, మలినేని మూవీకి తమన్ సంగీతాన్నందిస్తుండగా.. రిషి పంజాబీ సినిమాటోగ్రాఫర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించనున్నారు. గత ఏడాది ‘గదర్ 2‘తో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లు వసూళ్లు సాధించాడు సన్నీ డియోల్. ఈనేపథ్యంలో.. గోపీచంద్ మలినేనితో ఈ వెటరన్ యాక్టర్ చేయబోతున్న సినిమాపై అటు బాలీవుడ్ లోనూ భారీ బజ్ ఉంది.