‘గం గం గణేశా’ ట్రైలర్.. ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీ

‘బేబి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నుంచి వస్తోన్న మూవీ ‘గం గం గణేశా’. ఈ మూవీలో ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా అవుతున్నారు. మే 31న విడుదలకు ముస్తాబైన ‘గం గం గణేశా’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్.

ఇప్పటివరకూ ఆనంద్ దేవరకొండ చేసిన సినిమాలకు భిన్నంగా ‘గం గం గణేశా’ రాబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాలో ఓ దొంగ గా కనిపించబోతున్నాడు ఆనంద్. ఆద్యంతం గణేష్ విగ్రహం చుట్టూ సాగే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. ట్రైలర్ అయితే వైవిధ్యంగా ఆకట్టుకుంటుంది.

Related Posts