ప్రభాస్ మూవీ అనుకుని రాజశేఖర్ ‘కల్కి’కి టికెట్స్ బుక్ చేసుకుంటున్న ఫ్యాన్స్

కొన్ని నెలల గ్యాప్ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. రెబెల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ ‘కల్కి 2898 ఎ.డి’ రిలీజ్ కు రెడీ అయ్యింది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ‘కల్కి’కి సంబంధించి తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటలోనే రికార్డు స్థాయిలో టిక్కెట్స్ అమ్ముడుపోయాయి. ఒకానొక దశలో బుక్ మై షో సర్వర్ క్రాష్ అయ్యింది.

రెబెల్ ఫ్యాన్స్ అంతా ‘కల్కి’ కోసం టిక్కెట్స్ బుక్ చేసుకోవాలనే ఆతృతతో.. వెనుకా ముందూ చూసుకోకుండా టిక్కెట్ బుక్ చేసుకోవడం.. బుక్ అయిన తర్వాత అది గతంలో వచ్చిన రాజశేఖర్-ప్రశాంత్ వర్మ ‘కల్కి’కి బుక్ అయినట్టు రావడంతో.. కొంతమంది ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అయితే.. అలాంటి ఆందోళనలు ఏమీ అవసరం లేదని.. సాంకేతిక సమస్య వలనే అలా జరిగిందని.. బుక్ మై షో వివరణ కూడా ఇచ్చింది.

మొత్తానికి.. ఈ బుకింగ్స్ చూస్తుంటే.. వరల్డ్ వైడ్ గా ప్రభాస్ ‘కల్కి’ కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు.. ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేకపోయినా.. ‘కల్కి’ ట్రైలర్ చూసిన చాలామంది సెలబ్రిటీలు.. సోషల్ మీడియా వేదికగా ‘కల్కి’ చిత్రానికి తన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండియన్ సినిమా గ్లోబల్ లెవెల్ లో నిలబెట్టే చిత్రంగా ‘కల్కి’ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Related Posts