‘భారతీయుడు 2’ కంటే ముందు వస్తోన్న ‘భారతీయుడు’

ఈమధ్య తెలుగు, తమిళం భాషల్లో రీ రిలీజుల ట్రెండ్ జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో.. కమల్ హాసన్-శంకర్ కలయికలో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నాడు నిర్మాత ఎ.ఎమ్.రత్నం. ఇటీవల తమిళంలో ఎ.ఎమ్.రత్నం తన ‘గిల్లీ’ సినిమాని రిరిలీజ్ చేశాడు. కొత్త సినిమాలకు మించిన రీతిలో విజయ్ ‘గిల్లీ’ బాక్సాఫీస్ దుమ్ము దులిపింది. ఈ సినిమా రీరిలీజ్ లో ఏకంగా రూ.26.50 కోట్లు వసూలు చేసింది.

జూలైలో ‘భారతీయుడు 2’ విడుదలకు ముస్తాబవుతోన్న నేపథ్యంలో.. తన ‘భారతీయుడు’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు ఎ.ఎమ్.రత్నం. 1996లో విడుదలైన కమల్-శంకర్ ‘భారతీయుడు’ చిత్రాన్ని తెలుగు-తమిళం భాషల్లో నిర్మించింది ఎ.ఎమ్.రత్నం. జూన్ 7న ‘భారతీయుడు’ సినిమాని రెండు భాషల్లోనూ భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఎ.ఎమ్.రత్నం. కథ ప్రకారం కూడా ‘భారతీయుడు’కి కొనసాగింపుగా ‘భారతీయుడు 2’ ఉండబోతుంది. ఆ విధంగానూ ‘భారతీయుడు’ రీ రిలీజ్ ‘భారతీయుడు 2’కి బాగా కలిసొచ్చే అంశం అని భావిస్తున్నారట మేకర్స్. అయితే.. ‘భారతీయుడు’ చిత్రాన్ని ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తే.. ‘భారతీయుడు 2’ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

Related Posts