మోక్షఙ్ఞ ఎంట్రీ గురించి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాబోయే వారసుల గురించి ప్రస్తావిస్తే.. వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. ఈ నందమూరి వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతూనే ఉంది. లేటెస్ట్ గా మోక్షఙ్ఞ డెబ్యూ మూవీ గురించి నటసింహం బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లేటెస్ట్ గా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ.. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడారు. ‘మా అబ్బాయి మోక్షు కూడా పరిశ్రమకి రావాలి. తను కూడా విశ్వక్, అడవి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువతరాన్నే స్ఫూర్తిగా తీసుకోవాలని చెబుతుంటా’ అని బాలయ్య అన్నారు. అలాగే.. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా.. ‘తపన ఉన్న నిర్మాత వంశీ. మరో మంచి కలయిక ఉంది. త్వరలోనే దాన్ని ప్రకటించబోతున్నాం’ అని బాలయ్య క్లారిటీ ఇచ్చారు.

అసలు బాలకృష్ణ వందో సినిమా అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ తో ఇంట్రడ్యూస్ అవుతాడని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అలాగే.. బోయపాటి శ్రీను, త్రివిక్రమ్, క్రిష్ లలో ఒకరు మోక్షజ్ఞను పరిచయం చేస్తారనే న్యూస్ కూడా చాన్నాళ్ల నుంచి చక్కర్లు కొడుతోంది. మొత్తంమీద.. బాలయ్య క్లారిటీ ఇచ్చేయడంతో త్వరలోనే నందమూరి మోక్షఙ్ఞ ఎంట్రీ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Related Posts