బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేవ్ పార్టీ కేసులో అరెస్టైన హేమకు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. బెయిల్ లభించిన నేపథ్యంలో హేమ జైలు నుంచి బయటకు రానున్నారు.
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/06/telugu-actress-hema-1716190289.jpg.webp)
గత నెల 20న బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీ.ఆర్ ఫామ్హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగిందని పోలీసులు గుర్తించారు. దాదాపు వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈకోవలోనే రేవ్ పార్టీలో పాల్గొన్న నటి హేమ డ్రగ్స్ టెస్ట్ రిజల్ట్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. నటి హేమ రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో.. హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడీ విధించారు.