‘నిన్నే చూస్తు’ సినిమా అందరికీ నచ్చుతుంది.

అక్టోబర్ 27 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు “నిన్నే చూస్తు’వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్లో, శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి), హీరోహీరోయిన్లుగా,కే. గోవర్ధనరావు దర్శకత్వంలో, పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మించిన చిత్రం “నిన్నే చూస్తు”.రమణ్ రాథోడ్ అందించిన మ్యూజిక్ అందించారు.ఈ చిత్రం నుండి విడుదలైన పాటలు, ఈ పాటలలోని రిధమ్స్ , బీట్స్‌ కు ప్రేక్షకుల నుండి విశేషంగా ఆదరణ లభిస్తుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 27 న విడుదలకు సిద్ధమైన సందర్భంగా చిత్ర యూనిట్ ‘నిన్నే చూస్తు’ ప్రి రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన సీనియర్ నటులు సుమన్, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, నిర్మాత రామ సత్యనారాయణ లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరంఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ ఎంతో బిజీ ఉన్న నాకు సుమన్ గారు ఫోన్ చేసి నిర్మాత, నటి అయిన హేమలత రెడ్డి గారి గురించి చెప్పడంతో ఈ సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చాను.ట్రైలర్, పాటలు చూసిన తర్వాత పెద్ద సినిమాల రేంజ్ లో మంచి క్వాలిటీ తో తీసిన హేమలత రెడ్డి గారి గురించి సుమన్ గారు ఎందుకు చెప్పారనేది తెలిసింది.

ఫారిన్ లోకేషన్స్ లో కూడా ఈ సినిమా పాటలను షూట్ చేయడం జరిగింది.చిన్న సినిమాలు ఇండస్ట్రీకి రావడం ఎంతో అవసరం ఫిల్మ్ చాంబర్ ఎప్పుడూ ఆట్టి దర్శక,నిర్మాతలకు సపోర్ట్ చేస్తుంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్సీనియర్ యాక్టర్ సుమన్ మాట్లాడుతూ..నాకు ఫోన్ చేసి సినిమా డేట్స్ కావాలన్నప్పుడు నేను బిజీగా ఉన్నా నాకున్న డేట్స్ అడ్జస్ట్మెంట్ చేసుకొని డేట్స్ ఇచ్చాను. నేను చిన్న సినిమాల నుంచి హీరోగా ఎదిగాను. ఇక్కడే యాక్టింగ్, డ్యాన్స్ ఇలా అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను. నటి, నిర్మాత హేమలత రెడ్డి చాలా యంగ్ అండ్ డైనమిక్ లేడీ తను సుహాసిని, భానుచందర్ లాంటి పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని సినిమాలో నటిస్తూనే నిర్మాతగా �