రాజ‌మండ్రిలో రామ్ చ‌ర‌ణ్‌

ఆర్ఆర్ఆర్ వంటి ఎపిక్ హిట్ త‌ర్వ‌త విడుద‌లైన ఆచార్య అనుకున్న రిజ‌ల్ట్ఇవ్వ‌క‌పోయినా.. శంక‌ర్ డైరెక్ష‌న్ లో సినిమాతో స‌త్తా చాటొచ్చు అనుకున్నాడు రామ్ చ‌ర‌ణ్. శంక‌ర్- రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ దేశ‌వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది కూడా. బ‌ట్.. అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. అందుకు కార‌ణం శంక‌ర్ భార‌తీయుడు2ను పూర్తి చేయాల్సిందే అని కోర్ట్ నుంచి ఆర్డ‌ర్స్ రావ‌డ‌మే. అప్పుడెప్పుడో ప్రారంభం అయిన భార‌తీయుడు2 కొన్ని అన‌కోని కార‌ణాల‌తో ఆగిపోయింది. ఓ ద‌శ‌లో శంక‌ర్ వ‌ల్ల కోర్ట్ వ‌ర‌కూ వెళ్లింది. చివ‌రికి కోర్ట్ నిర్మాత‌ల‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ముందు త‌మ‌సినిమానే పూర్తి చేయాల‌ని నిర్మాత‌లు ప‌ట్టుప‌ట్టారు. కానీ అప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్ సినిమా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఉంది. ఇది పూర్తి చేయ‌డానికి భార‌తీయుడు2 నిర్మాత‌లు ఒప్పుకోలేదు.