తనను అభిమానించే వాళ్ల కోసం ఎలాంటి సహకారాన్ని అందించడానికైనా వెనుకాడడు నటసింహం బాలకృష్ణ. ఇక.. మొన్నటివరకూ ఎన్నికల వాతావరణంలో ఖాళీ లేకుండా గడిపేసిన బాలకృష్ణ.. ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమా ఫంక్షన్స్ లో సందడి చేస్తున్నాడు. ఇటీవలే కాజల్ అగర్వాల్ ‘సత్యభామ‘ ట్రైలర్ లాంఛ్ కు ముఖ్య అతిథిగా హాజరైన బాలయ్య.. ఇప్పుడు విశ్వక్ సేన్ కోసం మరోసారి స్టేజ్ పై సందడి చేయనున్నాడట.
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/05/image-163.png.webp)
నందమూరి కుటంబ కథానాయకులైన బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరితోనూ.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కి మంచి అనుబంధం ఉంది. గతంలో విశ్వక్ సేన్ నటించిన ‘ధమ్కీ‘ మూవీ ట్రైలర్ లాంఛ్ కు బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
![](https://telugu70mm.com/wp-content/uploads/cwv-webp-images/2024/05/image-162.png.webp)
మళ్లీ ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నటసింహం చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడట. మరోవైపు.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ సినిమాని నిర్మిస్తున్న సితార సంస్థలోనే బాలకృష్ణ 109వ సినిమా రెడీ అవుతోంది. అది కూడా ఈ సినిమా ఫంక్షన్ కి బాలయ్య వస్తాననడం వెనుక కారణం. మే 31న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ విడుదలకు ముస్తాబవుతోంది.