పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బాధ్షా షారుఖ్ ఖాన్ లు ఇద్దరు తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఈ డిసెంబర్ 22న పోటీ పడబోతున్నారు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్ పార్ట్ 1’, షారుఖ్, రాజ్ కుమార్ హిరాణి కాంబోలో తెరకెక్కిన ‘డంకీ’ ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాల మధ్య ఇప్పటికే గట్టి పోటీ ఉంది. ఒక వారం అయినా ఏదో ఒక సినిమా పోస్ట్ అయితే బావుంటుందని డిస్ట్రిబ్యూటర్స్ అనుకుంటున్నారు.
ఇలాంటి నేపథ్యంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ‘నేరు’ చిత్రాన్ని కూడా డిసెంబర్ 21న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తెలుగు, హిందీ బాషలలో ఈ సినిమా వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ, కేరళలో మాత్రం నేరు ఖచ్చితంగా సలార్, డంకీ చిత్రాల కలెక్షన్స్ కి గండికొట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘దృశ్యం’ తెరకెక్కించిన జీతూ జోసఫ్ దర్శకుడు కావడంతో ‘నేరు’ మూవీపై కేరళలో భారీగానే అంచనాలున్నాయి. ‘సలార్’, ‘డంకీ’ సినిమాల నుంచి ఇప్పటివరకూ వచ్చిన అప్డేట్స్తో భారీ హైప్ నెలకొంది. మరి ఈ సినిమాల మీద మోహన్ లాల్, జీతూ జోసఫ్ల ‘నేరు ‘ప్రభావం ఏమేరకు ఉంటుందో చూడాలి.