నాగ చైతన్య ఎవరికీ దొరకడం లేదా..?

వరుస ఫ్లాపులతో ఒక్కసారిగా డల్ అయ్యాడు నాగ చైతన్య. వీటికి ముందు కంటిన్యూస్ గా నాలుగు కమర్షియల్ హిట్స్ చూశాడు. కానీ ఎన్నో అంచనాలు పెట్టుకున్న థ్యాంక్యూ బాలీవుడ్ లో బెస్ట్ డెబ్యూ అవుతుందనుకున్న లాల్ సింగ్ చడ్డా పోవడంతో రీ థాట్ లో పడ్డాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ మూవీ తర్వాత పరశురామ్ డైరెక్షన్ లో మూవీ ఉంటుందన్నారు. బట్ లేటెస్ట్ గా ఆ ప్రాజెక్ట్ ను ఆపేశాడు అనే టాక్స్ వినిపిస్తున్నాయి. అందుకు రెండు కారణాలు చెబుతున్నారు.


విజయాలకు పొంగిపోవద్దు.. అపజయాలకు కుంగిపోవద్దు అని ప్రతి ఒక్కరికీ చిన్నప్పటి నుంచీ చెబుతూనే ఉంటారు. మరి రాత్రికి రాత్రే ఫేట్ మారిపోయే పరిశ్రమలో వీటి విషయంలో ఎంత స్టడీగా ఉంటే అంత మంచిది. అలాగని అసలు పట్టించుకోపోయినా ప్రాబ్లమ్ తప్పదు. అందుకే సినిమా పరిశ్రమను మాయా ప్రపంచం అంటారు కొందరు. ఆ ప్రపంచంలోనే చిన్నప్పటి నుంచీ ఉన్న నాగ చైతన్య ఒక్క ఫ్లాప్ కే షాక్ తిన్నాడు. అందుకు కారణం ఈ చిత్ర దర్శకుడు విక్రమ్ కె కుమార్.

చైతూ ఫ్యామిలీతో అతను మనం అనే క్లాసిక్ మూవీ తీశాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు ఫ్లాపులు పడ్డాయి విక్రమ్ కు. అయినా చైతన్య ధైర్యం చేసి ప్రాజెక్ట్ ఇస్తే దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు విక్రమ్. దీనివల్ల చైతూకు ఫ్లాప్ తప్పలేదు. అయితే ఈ ఒక్క ఫ్లాప్ కే అతను మరీ అతి జాగ్రత్తగా మారిపోయాడు. ప్రస్తుతం మోస్ట్ టాలెంటెడ్ అనిపించుకున్న తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కస్టడీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో చైతన్య అగ్రెసివ్ రోల్ చేస్తున్నాడని చెబుతున్నారు. అతనికి జోడీగా కృతిశెట్టి నటిస్తోంది.

ఇక ఈ మూవీ తర్వాత గతంలోనే ఓకే అయిన పరశురామ్ తో సినిమా చేయాలనుకున్నాడు. పరశురామ్ గతంలో చైతన్యకు హ్యాండ్ ఇచ్చి మహేష్‌ బాబుతో సర్కారువారి పాట