ఎన్టీఆర్-కొరటాల అప్డేట్ చెప్పారు..అయినా ఆలస్యమే..

కొన్నాళ్ల క్రితం వరకూ ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందీ అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లు కనిపించాయి. బట్ ఈ మధ్య కాలంలో చూస్తే అవేం లేవు. అంటే అర్థమైంది కదా.. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. మరీ ఎక్కువగా లాగితే తెగిపోతుంది. ఆ టైమ్ లో కనిపించిన ఇంట్రెస్ట్ ఇప్పుడు లేకపోవడానికి కారణం.. ఈ మూవీ గురించి ఇప్పటి వరకూ సరైన అప్డేట్ లేకపోవడమే. ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా వేళ్లు అరిగేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. బట్ మూవీ టీమ్ పట్టించుకోలేదు. అందుకే అంతా సైలెంట్ అయ్యారు. మరీ ఇంత సైలెంట్ అయితే బావోదు అనుకున్నారేమో లేటెస్ట్ గా ఓ స్ట్రాంగ్ అప్డేట్ చెప్పేశారు.


ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారాడు ఎన్టీఆర్. తన అద్భుతమైన నటనతో ప్రపంచ ప్రేక్షకులను ఫిదా చేశాడు. ఆ మధ్య గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కోసం అలాగే ఆస్కార్ నామినేషన్స్ కోసం వేసిన ప్రీమియర్స్ తర్వాత ప్రేక్షకులతో బాగా ఇంటరాక్ట్ అయ్యాడు. బట్ బ్యాడ్ లక్.. ఆస్కార్ అందని ద్రాక్ష అయిపోయింది. అయితే ఈ గొడవలో పడిపోయి ఆల్రెడీ కమిట్ అయిన కొరటాల శివ సినిమా గురించే పట్టించుకోవడం మానేశారు ఫ్యాన్స్. నిజానికి ఆర్ఆర్ఆర్ తర్వాత శివతో సినిమా చేయడం చాలామంది అభిమానులకు నచ్చలేదు. అయినా ఎన్టీఆర్ ఆయనకే ఓటు వేశాడు.

ఆల్రెడీ వీరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఖచ్చితంగా చూస్తే అదేమంత బలమైన కథ కాదు. అయినా కొరటాలకే ఎందుకు ఎస్ చెప్పాడో కానీ.. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశాన్ని అతను ఏ మాత్రం ఉపయోగించుకుంటున్నట్టు లేదు అనే భావన కలిగేలా చాలాచాలా ఆలస్యం చేశాడు. ఇప్పటి వరకూ ఈ కథ పూర్తయిందా లేదా అనేది కూడా ఖచ్చితంగా తెలియదు.

మరోవైపు అప్డేట్స్ కూడా ఏం చెప్పడం లేదు. ఆ మధ్య జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారు అన్నారు. కానీ ఆమె చెప్పిన రెమ్యూనరేషన్ కు నిర్మాతలకు షాక్ తగిలిందట. దీంతో అభిమానులు కూడా �