మన్మధరాజాట్రైలర్ ను విడుదల చేసిన ప్రతాని రామకృష్ణ గౌడ్

మాక్ కింగ్స్ క్రియేషన్స్ పతాకంపై రోషన్, పూజ డే, అమీక్ష పవర్ హీరో, హీరోయిన్స్ గా యం.డి. అభిద్ దర్శకత్వంలో యం.డి. అహ్మద్ ఖాన్ నిర్మించిన చిత్రం “మన్మధరాజా” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నగేష్ , అడిషనల్ డి.యస్ పి లక్ష్మణ్ రావ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్, యస్.యం. యస్. ఇంటర్నేషనల్ డైరెక్టర్ దుబాయ్ వాజీద్, డైరెక్టర్ ప్రసాద్ తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో



మాజీ ఎమ్మెల్యే నగేష్ , అడిషనల్ ఏ.యస్ పి లక్ష్మణ్ నారాయణ మాట్లాడుతూ.. “మన్మధరాజా” ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్ ఇంతకు ముందు చేసిన సినిమాలు హిట్ అయినట్లే ఇప్పుడు వస్తున్న సినిమా కూడా బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉందని అన్నారు.

ప్రతాని రామకృష్ణ గౌడ్, మాట్లాడుతూ.. చిత్ర నిర్మాత యం.డి. అహ్మద్ ఖాన్ కు యూత్ మెచ్చే సినిమాలు తీస్తున్నాడు. తను ఇంతకుముందు “ఓ మధు” అనే సినిమాలో వారి అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీసి సక్సెస్ అయ్యాడు.ఈ జనరేషన్ లో విడుదలైన “ఓ మధు” సినిమా 30 రోజుల థియేటర్స్ లలో ఆడడం అంటే ఆషామాషీ కాదు. తనకు సినిమా అంటే ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఆ సినిమా తరువాత “ఉత్తమ విలన్” సినిమా తీశాడు.అందులో తను విలన్ గా అద్భుతంగా నటించాడు. మళ్లీ ఇప్పుడు మన్మధరాజా సినిమాతో ప్రేక్షకుల