సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం ‘మిడ్‌నైట్ రన్నర్స్’ కు అధికారిక రీమేక్ గా నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘శాకిని డాకిని’. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘శాకిని డాకిని’ సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హీరో అడవి శేష్, దర్శకులు నందిని రెడ్డి, అనుదీప్, విమల్ కృష్ణ ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో సీనియర్‌ కథానాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజుకు నివాళిగా చిత్ర బృందం మౌనం పాటించి అంజలి ఘటించింది. అడవి శేష్ మాట్లాడుతూ.. రెజీనా కసాండ్రా, నివేదా థామస్ వండర్ ఫుల్ యాక్టర్స్. రెజీనాతో ‘ఎవరు’లో కలసి పని చేశా. మొన్ననే రెజీనా రాకెట్ బాయ్స్ చూశాను. చాలా నచ్చింది. నివేదా చేసిన నిన్ను కోరి, బ్రోచేవారెవరురా నాకు చాలా ఇష్టం. తను ఏ పాత్ర చేసిన అద్భుతంగా వుంటుంది. ఈ ఈవెంట్ కి రావడానికి కారణం సునీత గారు. మా కోరిక మేరకు సునీత గారు మేజర్ లో హీరోయిన్ మదర్ గా చేశారు. అయితే లెంత్ కారణంగా సినిమాలో సీన్లు వుంచడం కుదరలేదు. ఈ ఈవెంట్ వేదికగా సునీత గారికి క్షమాపణలు చెబుతున్నా.  ‘మిడ్‌నైట్ రన్నర్స్’ ఇద్దరు అబ్బాయిలు చేసిన సినిమా. ఇందులో ఇద్దరు అమ్మాయిలు చేయడం చాలా క్యూరియాసిటీని పెంచుతోంది. సెప్టెంబర్ 16న ‘శాకిని డాకిని’  థియేటర్లోకి వస్తుంది. నేను థియేటర్ లో ఉంటా. థియేటర్ లో కలుద్దాం” అన్నారు. నందిని రెడ్డి మాట్లాడుతూ.. హీరోయిన్ సెంట్రిక్ యాక్షన్ కామెడీ గా ‘శాకిని డాకిని’ రావడం చాలా ఆనందంగా వుంది. ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేస్తే అదిరిపోతుంది. నాకు �