వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఈ నెల 25న థియేటర్లలో విడుదలౌతోంది. ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ తో టీమ్ ప్రమోషన్ ‌ల దూకుడు పెంచబోతోంది. ట్రైలర్ కు సంబంధించి థియేట్రికల్, డిజిటల్ రిలీజ్ కోసం మేకర్స్ రెండు వేర్వేరు తేదీలను లాక్ చేశారు. నవంబర్ 11న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుండగా, డిజిటల్ వెర్షన్ నవంబర్ 12న విడుదల చేస్తున్నారు.’ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ సమంత ‘యశోద’, హాలీవుడ్ యాక్షన్-..అడ్వెంచర్ బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్ చిత్రాలను ప్రదర్శించే అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ పోస్టర్‌ లో అల్లరి నరేష్ అడవిలో గిరిజనులతో కలిసి నడుస్తూ సీరియస్‌గా కనిపిస్తున్నారు, అతని పక్కనే ఒక వ్యక్తి నరేష్ చేయి పట్టుకుని రావడం కనిపిస్తోంది. పోస్టర్ విడుదల తేదీని చూపిస్తోంది.ఈ చిత్రంలో అల్లరి నరేష్‌ గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Read More