హిడింబ ట్రైలర్ రివ్యూ

యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘హిడింబ’. ఈ టైటిల్ అనౌన్స్ అయిన దగ్గర్నుంచీ.. ఫస్ట్ లుక్, టీజర్ వరకూ ఓ రేంజ్ లో అంచనాలు పెంచింది. ఆరకంగా సినిమాపై క్యూరియాసిటీ పెంచడంలో మూవీ టీమ్ బాగా సక్సెస్ అయింది. ఆ క్యూరియాసిటీని పెంచాల్సిన టైమ్ లో సడెన్ గా సైలెంట్ అయ్యారు. అంతా మర్చిపోతోన్న టైమ్ లో మళ్లీ ట్రైలర్ లాంచ్ అంటూ హంగామా మొదలైంది.

విరూపాక్ష హీరో సాయితేజ్ చేతుల మీదుగా ఈ హిడింబ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ 1908 నుంచి ఆరంభం అయింది. బ్రిటీష్‌ వారు కొంతమంది భారతీయులను ఒక దీవికి దగ్గరగా సముద్రం ఒడ్డుకు తీసుకువచ్చిన చంపేస్తుంటారు. కట్ చేస్తే కథ మళ్లీ ఈ కాలానికి వస్తుంది. సిటీలో కొంతమంది అమ్మాయిలు వరుసగా కిడ్నాప్ అయ్యి దారుణంగా హత్య చేయబడుతుంటారు. వారిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ గా నియమించబడతాడు అశ్విన్.

అతనికి తోడుగా హీరోయిన్ నందిత శ్వేత కనిపిస్తోంది. ఈ ఇద్దరూ కలిసి ఆ కిల్లర్ రెడ్ కలర్ చుట్టూ తిరుగుతున్నాడు అని అర్థం చేసుకుని ఆ దిశగా ఓ ఎత్తుగడ వేస్తే అది ఫెయిల్ అవుతుంది. అయితే ఆ కిల్లర్ కు ఈ రెడ్ కలర్ కు ఉన్న సంబంధాన్ని అన్వేషిస్తుండగా మళ్లీ కథ.. 1908లో బ్రిటీష్‌ వారు వదిలిన కొందరు భారతీయుల ఆనవాలుకు వెళుతుంది. మరి ఈ రెండిటికి మధ్య ఉన్న సంబంధం ఏంటీ..? ఆ హత్యలు చేస్తున్నది ఎవరు.. ఇది కనుక్కోవడమే సినిమా అంటూ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోందీ ట్రైలర్.


ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ కన్నెగంటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి. అశ్విన్ ఇప్పటి వరకూ కొన్ని సినిమాల్లో నటించినా.. ఇది పూర్తి భిన్నంగా ఉంది. అలాగే సైకో కిల్లర్, సీరియల్ మర్డర్స్ అనే పాయింట్ పాతదే అయినా.. దాని నేపథ్యాన్ని ఇంట్రెస్టింగ్ గా తీసుకున్నారనిపిస్తోంది. ఈ పాయింట్ వర్కవుట్ అయితే ఖచ్చితంగా హిడింబ సూపర్ హిట్ అవుతందని చెప్పొచ్చు. ట్రైలర్ లో అశ్విన్, నందిత శ్వేత జోడీ బావుంది. ఇద్దరి మధ్య ఓ ఇంటిమేట్ సీన్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే బ్రిటీష్‌ వారి కాలంలో వదిలేసిన కొందరు భారతీయులే ఇలా క్రూరంగా మారారా అనే క్లూ కూడా వదిలారు. ఆ క్లూను దాటి ఇంకేదైనా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటే ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. మొత్తంగా అశ్విన్ ఈ సారి గట్టిగా కొట్టేలానే ఉన్నాడనిపిస్తోంది.

Related Posts