NTR : బాలయ్య, ఎన్టీఆర్ ఇంకెప్పుడూ కలవరా..?

ఎవరు ఏమనుకున్నా.. హీరోలకుసంబంధించి టాలీవుడ్ లో మూడు నాలుగు ఫ్యామిలీస్ దే హవా. వీరికే ఫ్యాన్ బేస్ పెద్దది. అందుకే ఈ ఫ్యామిలీ హీరోలంతా ఒకే వేదికపై కనిపిస్తే అభిమానుల్లో ఉత్సాహం డబుల్ అవుతుంది. అయితే ఈ విషయంలో నందమూరి హీరోలు కాస్త డిఫరెంట్ గా కనిపిస్తారు.

ఇతర ఫ్యామిలీ హీరోల్లా వీరు తరచూ కలవరు. కలిసినా అంటీముట్టనట్టుగా ఉంటారు అనేందుకు అనేక వేదికలు ఉదాహరణలుగా ఉన్నాయి. బాబాయ్, అబ్బాయ్ లు కలిసి ఒకే వేదికను పంచుకుంటారు అనే వార్తే చాలు.. నందమూరి ఫ్యాన్స్ లో ఓ కొత్త వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది.

అయితే గత నెల 25న జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ముగింపు సభకు బాలయ్య, చంద్రబాబు తర్వాత ఎంతమంది ఉన్నా.. జూనియర్ ఎన్టీఆర్ కోసమే ఎన్నో కళ్లు వెదికాయి అనేది నిజం. అతనొస్తే అటు ఫ్యామిలీ బానే ఉందనే సంకేతాలు వెళతాయి. తర్వాత తెలుగుదేశం పార్టలోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. బట్ జూనియర్ వెళ్లలేదు.

అతనికి ఆహ్వానం లేదని అతని సన్నిహితులు చెప్పారు. ఇచ్చాం అని నిర్వాహకులు చెప్పారు. సరే అప్పుడు విజయవాడలో జరిగిన సభ. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుత