NTR : ఇంతమందిలో ఎన్టీఆర్ పలచన అయిపోతాడేమో..?

నందమూరి తారకరామారావు.. తెలుగు నేలపై చరిత్ర సృష్టించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పుట్టి వందేళ్లైన సందర్భంగా గతేడాది నుంచే శత జయంతి ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు.

రీసెంట్ గా ఈ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ విజయవాడలో జరిగింది. తెలంగాణలో ఈ శనివారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం చాలామంది ఆసక్తిగా చూసిన జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వానం అతనికి మాత్రమే కాదు.. ఇంకా చాలామందికి ఉంది. అందులో పవన్ కళ్యాణ్‌, ప్రభాస్, అల్లు అర్జున్‌, రామ్ చరణ్‌ లు కూడా ఉన్నారు.

ఇంతమందిలో ఎన్టీఆర్ ఖచ్చితంగా పలచన అవుతాడు అనేది ఆయన అభిమానుల భావన. అలా కావాలనేదే నిర్వాహకుల కోరిక అనేలా కొత్త కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేంటీ అనుకుంటున్నారు కదూ.. ? అందుకు ఓ కారణం ఉంది.
ఇంతకు ముందు విజయవాడలో సభ జరిగినప్పుడు జూనియర్ కు ఆహ్వానం లేదు అని చాలామంది అనుకున్నారు. బట్ అతన్ని ఇన్వైట్ చేశారు. కానీ వెళ్లలేదు. అందుకు కారణం.. అంతకు ముందే గుడివాడ కేంద్రంగా జరిగిన