మళ్లీ పెళ్లి.. టైటిల్ తోనే ఆకట్టుకున్నాడు నరేష్. పవిత్రతో తన ప్రేమ, పెళ్లి వ్యవహారం గురించి మీడియాతో పాటు సోషల్ మీడియాస్ లో వస్తోన్న అనేక ప్రశ్నలకు ఈ సినిమాతో సమాధానం చెప్పబోతున్నానని చెప్పకనే చెప్పాడు.
ఈ చిత్రాన్ని తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో మెమరబుల్ మూవీస్ అందించిన విజయ కృష్ణ బ్యానర్ లో నిర్మించడం విశేషం. ఈ బ్యానర్ లో చాలాకాలం తర్వాత వస్తోన్న చిత్రం కూడా ఇదే. మాజీ నిర్మాత నుంచి దర్శకుడుగా మారిన ఎమ్మెస్ రాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఆ మధ్య విడుదల చేసిన ట్రైలర్ తో బానే ఆకట్టుకున్నారు.
కొంతమంది సెలబ్రిటీస్ కు స్పెషల్ స్క్రీనింగ్ వేసి అందరి చేతా ఆహా ఓహో అనిపించారు కానీ.. ఆడియన్స్ ను అట్రాక్ట్ చేయడానికి అది సరిపోదు. అందుకే ఈ జంట ఇక మహేష్ బాబు జపం మొదలుపెట్టారు.
తమ పెళ్లి మహేష్ బాబుకు ఇష్టమే అని.. ఇద్దరూ చాలా బావున్నారు.. బావుండండి అన్నాడు అని.. ఈ మూవీమంచి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడనీ .. చెబుతూనే.. మహేష్ ఫ్యాన్స్ కు మా మళ్లీ పెళ్లి మరింతగా నచ్చుతుందని చెబుతున్నారు.