షూటింగ్ పూర్తిచేసుకున్నశశివదనే’ చిత్రం

గౌరీ నాయుడు సమర్పణలో ఎస్‌విఎస్‌ కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. మరియు ఏజీ ఫిల్మ్ కంపెనీ పతాకంపై యువ కథానాయకుడు రక్షిత్ అట్లూరి హీరోగా, కోమలీ ప్రసాద్ హీరోయిన్ గా,సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె , ప్రవీణ్ యండమూరి, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ నటీనటులుగా సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం లో అహితేజ బెల్లంకొండ నిర్మాణ సారద్యంలో గోదావరి నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ కోనసీమలోని అందమైన లొకేషన్లలో 50 రోజుల పాటు జరిపిన చిత్రీకరణ జరుపుకుంది.ఈ సినిమా మూడు రోజుల ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగాచిత్ర నిర్మాత అహితేజ బెల్లంకొండ  మాట్లాడుతూ..

శశివదనే’ చిత్రాన్ని కోనసీమ, అమలాపురంలోని సుందరమైన లొకేషన్లలో 50 రోజుల పాటు చిత్రీకరించాం. అద్భుతమైన అనుభవం మరియు జ్ఞాపకాలను అందించిన కోనసీమకు ధన్యవాదాలు.ఈ రోజు విడుదల చేసిన ఒక వీడియో క్లిప్‌లో, పెద్ద ఎత్తున పొలాలు మరియు చెట్లను సౌందర్యంగా బంధించడాన్ని మనం చూస్తాము. ‘శశివదనే’ విజువల్స్ ఎలా ఉండబోతుందో చెప్పడానికి అద్భుతమైన వీడియో నిదర్శనం. సినిమాలో ప్రేమ సన్నివేశాలు రిఫ్రెష్‌గా ఉండబోతున్నాయి. గోదావరి ల